Karnataka: కృష్ణానదిలోకి భారీగా వరద వస్తోంది... తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కర్ణాటక!

  • కర్ణాటకలో భారీ వర్షాలు
  • 5 లక్షల క్యూసెక్కుల వరదకు చాన్స్
  • సమాచారం ఇచ్చిన కర్ణాటక ఇంజనీర్లు

తమ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణానదికి మరింత వరద వచ్చే ప్రమాదం ఉందని కర్ణాటక ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు కర్ణాటక ఇంజనీర్ల నుంచి సమాచారం అందినట్టు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొస్తుందని కూడా వారు తెలిపారు. ఇప్పటికే నీటి విడుదలను పెంచామని అన్నారు. ఇదిలావుండగా, జూరాలకు ఎగువన ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి కూడా భారీ వరద కృష్ణలోకి కలుస్తోంది.

  • Loading...

More Telugu News