Andhra Pradesh: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఏపీ సీఎం జగన్ భేటీ!

  • నిన్న ఢిల్లీకి వెళ్లిన జగన్
  • ప్రధాని  మోదీతో ప్రత్యేకంగా భేటీ
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతి

ఢిల్లీలో నిన్న ప్రధాని మోదీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్ ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, నందిగం సురేష్‌, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు. 

More Telugu News