Simhachalam: మహిళతో వివాహేతర బంధం.. ఆమె కుమారుడి కిడ్నాప్... కేసును ఛేదించిన విశాఖ పోలీసులు!

  • తల్లిని నమ్మించి సింహాచలం తీసుకువచ్చిన శేఖర్
  • ఆమె తనతోనే ఉండాలన్న ఉద్దేశంతో బాలుడి కిడ్నాప్
  • మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు

విశాఖజిల్లా సింహాచలం సమీపంలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బిడ్డ తల్లితో సంబంధం పెట్టుకున్న శేఖర్ అనే వ్యక్తి బాలుడిని అపహరించుకు వెళ్లాడని తెలిపారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, హుకుంపేటకు చెందిన కాంతమ్మ తన బిడ్డ అభిరాం(2)తో కలిసి సోమవారం విశాఖపట్నం రాగా, అక్కడ శేఖర్ ఆమెను కలిశాడు.

 ముగ్గురూ కలిసి ఆటోలో సింహాచలం వెళ్లి, స్వామిని దర్శించుకుని కొండ కిందకు వచ్చారు. ఆపై అభిరాం, శేఖర్ కనిపించలేదు. దీంతో కంగారుపడిన కాంతమ్మ, తన కుమారుడిని కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులను ఆశ్రయించగా, శేఖర్ పై అనుమానంతో మొబైల్‌ కాల్‌ ట్రాకింగ్‌ ఆధారంగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. భర్తతో కాంతమ్మకు విభేదాలున్నాయని గమనించిన శేఖర్ ఆమెను నమ్మించి దగ్గరయ్యాడని, ఆమె తనతోనే ఉండాలన్న ఉద్దేశంతో పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని పోలీసులు వెల్లడించారు.

More Telugu News