Visakhapatnam District: విశాఖ హెచ్‌పీసీఎల్ విస్తరణ పనుల్లో అపశ్రుతి.. ఇద్దరి దుర్మరణం

  • మట్టిపెళ్లలు విరిగిపడడంతో తీవ్ర గాయాలు 
  • మరొకరి పరిస్థితి విషమం
  • బాధితులను జార్ఖండ్‌కు చెందిన వారిగా గుర్తింపు

విశాఖపట్టణంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విస్తరణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆసుపత్రిలో నిర్మాణ పనులు జరుగుతుండగా కూలీలపై ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతులను జార్ఖండ్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News