Jammu And Kashmir: మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి ఏసీబీ నోటీసులు

  • జమ్ము కశ్మీర్ బ్యాంకు ఉద్యోగాల కుంభకోణం కేసు
  • ఈ కేసులో వివరణ నిమిత్తం ఆమెకు నోటీసులు
  • ఇలాంటి నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్న ముఫ్తీ

జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి ఏసీబీ నోటీసులు జారీ అయ్యాయి. జమ్ము కశ్మీర్ బ్యాంకు ఉద్యోగాల కుంభకోణం కేసులో వివరణ నిమిత్తం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ముఫ్తీ ఓ ట్వీట్ చేశారు. అవినీతి నిరోధక శాఖ నుంచి తనకు ఈ నోటీసులు అందడంలో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. కశ్మీర్ కు చెందిన ప్రధాన నేతలను బెదిరించేందుకు కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, ఇటువంటి కుట్రలు ఇక్కడ చెల్లవని అన్నారు. 

More Telugu News