ఆత్మహత్య చేసుకున్న ‘నారాయణ’ విద్యార్థి.. కాలేజీ వేధింపులే కారణమన్న మృతుల తల్లిదండ్రులు!
- ఏపీలోని కడప జిల్లాలో ఘటన
- ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్న హర్షవర్థన్
- కాలేజీ ఏజీఎం కొట్టాడని తల్లిదండ్రుల ఆరోపణ
అయితే కాలేజీ అధ్యాపకుల వేధింపుల కారణంగానే హర్షవర్థన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ ఏజీఎం తన కుమారుడిని కొట్టారనీ, లెక్చరర్ల ముందు దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవమానం తట్టుకోలేకపోయిన హర్షవర్థన్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మరోవైపు హర్షవర్థన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి కేసూ నమోదు కాలేదు.