Rakshasudu: చెలరేగిన పైరసీ భూతం... తమిళ్ రాకర్స్ వెబ్ సైట్లో 'రాక్షసుడు' చిత్రం!

  • అనేక చిత్రాలను పైరసీ చేసిన తమిళ్ రాకర్స్
  • వెబ్ సైట్ బ్లాక్ చేసినా కొత్త డొమైన్ నేమ్ లతో స్వైరవిహారం
  • ఆందోళన చెందుతున్న 'రాక్షసుడు' యూనిట్!

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సైకో థ్రిల్లర్ మూవీ 'రాక్షసుడు' పైరసీ బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తమిళ్ రాకర్స్ వెబ్ సైట్లో ప్రత్యక్షం అయినట్టు సమాచారం. అనేక పెద్ద సినిమాలను కూడా పైరసీ చేసి ఆన్ లైన్లో పెట్టే గ్రూపుగా తమిళ్ రాకర్స్ పేరుగాంచింది. తమిళ్ రాకర్స్ పై నిషేధం ఉన్నప్పటికీ, వెబ్ సైట్ డొమైన్ నేమ్ లు మార్చుకుంటూ కొత్త పేర్లతో పైరసీకి పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. 'రాక్షసుడు' సినిమా శుక్రవారం రిలీజ్ కాగా,  విడుదల రోజే ఈ చిత్రం పైరసీ బారిన పడిందన్న వార్తలతో చిత్రబృందం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News