Andhra Pradesh: నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటన!

  • మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలుకు చేరుకోనున్న మంత్రి
  • రాత్రికి అక్కడే బస 
  • ఆదివారం తిరుపతికి ప్రయాణం

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి శ్రీనివాస్ ఒంగోలు పట్టణానికి చేరుకుంటారు. అనంతరం గంటన్నర పాటు స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. రాత్రి అక్కడే బస చేశాక రేపు ఉదయం 7 గంటలకు శ్రీ గాయత్రి మందిరం, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు.

అనంతరం కారులో చీమకుర్తికి బయలుదేరుతారు. చీమకుర్తిలోని ఓ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన పౌర సంగమం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరుపతికి రోడ్డు మార్గంలో వెళతారు. రాత్రికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడే బస చేస్తారు. ఈ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ దేవాదాయ శాఖ ఓఎస్డీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

More Telugu News