ఇంకోసారి టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేయను.. బుద్ధా వెంకన్న సంచలన ప్రకటన!
- బాధ్యతలు ఎవరికి ఇచ్చినా సహకరిస్తా
- విజయవాడలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ భేటీ
- సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన బుద్ధా వెంకన్న
టీడీపీ అధినేత చంద్రబాబు నగర బాధ్యతలను ఎవరికి అప్పగించినా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అనంతరం సమావేశం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కృష్ణా జిల్లా నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ భేటీకి టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు హాజరయ్యారు.