TTD: రికార్డులకెక్కిన తిరుమల వేంకటేశుడు.. ఈ ఏడాది మూడుసార్లు వంద కోట్లు దాటిన ఆదాయం

  • మార్చి, జూన్, జూలై నెలల్లో వంద కోట్లు దాటిన ఆదాయం
  • ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో ఆదాయం ఇదే తొలిసారి
  • జూలైలో రూ.106.28 కోట్ల హుండీ ఆదాయం

తిరుమల వేంకటేశుని ఆదాయం రికార్డులకెక్కుతోంది. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు వంద కోట్ల రూపాయల ఆదాయం దాటింది. ఈ విషయాన్ని టీటీడీ తెలిపింది. శ్రీవారి హుండీ, భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఏడాది మార్చిలో రూ.105.8 కోట్ల ఆదాయం సమకూరగా, జూన్‌లో వంద కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తాజాగా, జూలైలో రూ.106.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. శ్రీవారికి ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారని టీటీడీ పేర్కొంది.

  • Loading...

More Telugu News