Shilpa Shetty: సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న శిల్పాశెట్టి

  • పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శిల్పా
  • తాజాగా నికమ్మా చిత్రంతో పునరాగమనం
  • సోషల్ మీడియాలో వెల్లడించిన నటి

పొడుగుకాళ్ల సుందరి అనే మాటకు అక్షరాలా అతికినట్టు సరిపోయే అందగత్తె శిల్పాశెట్టి. ఎంతో నాజూకుగా కనిపించే శిల్పా బాలీవుడ్ లోనే కాదు, దక్షిణాది భాషల్లోనూ అనేక చిత్రాలు చేసి అభిమానులకు దగ్గరైంది. అయితే, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైంది. భర్త, కుమారుడు, ఇతర వ్యాపకాలతో బిజీ అయింది. యోగా వీడియోలు, ఫిట్ నెస్ వీడియోలు, ఐపీఎల్ క్రికెట్ తో నిత్యం అభిమానులకు దగ్గరగానే ఉన్నా సినిమాల్లో మాత్రం నటించలేదు.

2007లో అప్నే చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె పూర్తిస్థాయిలో నటించలేదు. మూడు చిత్రాల్లో ఇలావచ్చి అలావెళ్లిపోయే కామియో రోల్స్ చేసింది. దశాబ్దకాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ మంగళూరు భామ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి స్వయంగా చెప్పింది. త్వరలోనే షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న నికమ్మా అనే చిత్రంలో నటించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో అమ్మడు పోస్టు పెట్టింది.

More Telugu News