Jagan: ప్రగతి భవన్ చేరుకున్న జగన్.. కాసేపట్లో కేసీఆర్ తో భేటీ

  • తెలంగాణ గవర్నర్ తో భేటీ అయిన జగన్
  • దాదాపు గంట సేపు చర్చలు
  • ఈ సాయంత్రం జెరూసలేం వెళ్లనున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రగతి భవన్ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాల అజెండాను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను ఆయన కలిశారు. రాజ్ భవన్ లో వీరిద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి.

అనంతరం ఈ సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి జెరూసలేం పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు జెరూసలేంలో పర్యటించనున్నారు. 5వ తేదీ మధ్యాహ్నానికి అమరావతి చేరుకుంటారు. 6వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

More Telugu News