Assembly: వైసీపీ తీసుకున్న కీలక నిర్ణయాలు, వాటి పర్యవసానాలను గవర్నర్‌కు వివరించిన సీఎం జగన్

  • అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులపై వివరణ
  • సమావేశాల్లో భాగంగా చర్చకు వచ్చిన పలు అంశాలు
  • ప్రజా సమస్యలపై చర్చించిన తీరును వివరించిన జగన్

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయి పలు కీలక విషయాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు తెన్నులపై గవర్నర్‌కు జగన్ వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చర్చకు వచ్చిన అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించిన తీరు, విపక్ష వ్యవహార శైలి తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం తీసుకున్న కీలక నిర్ణయాలతో పాటు వాటి పర్యవసానాలను బిశ్వభూషణ్‌కు జగన్ వివరించారు.

More Telugu News