Puri: నిర్మాతగా నన్ను ఒక ఆట ఆడేసుకున్నారు: పూరి జగన్నాథ్

  • దర్శకుడిగా నేను ఎప్పడూ హ్యాపీనే 
  • నిర్మాతగా చాలా కష్టాలు పడ్డాను
  •  నన్ను ఇబ్బంది పెట్టినవారి పేర్లను బయటపెడతానన్న పూరి      

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన 'ఇస్మార్ట్ శంకర్' ఇటీవలే థియేటర్స్ కి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడిగా ఈ సినిమా పూరికి విజయాన్ని ఇవ్వడమే కాకుండా నిర్మాతగా మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ, "దర్శకుడిగా నేను ఎప్పుడూ హ్యాపీనే .. కానీ ఒక నిర్మాతగా చాలా ఇబ్బందులు పడ్డాను.

నిర్మాతగా నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అది ఆడుతుందా .. లేదా అనే టెన్షన్ లో నిర్మాత ఉంటాడు. అలాంటి సమయంలో ఎవరికి వీలైనంతగా వాళ్లు ఆ నిర్మాతతో ఒక ఆట ఆడుకుంటారు. అలా నాతోనూ చాలామంది ఆడుకున్నారు. ఆ పరిస్థితుల్లో నేను చాలా బాధపడ్డాను. నన్ను ఇబ్బంది పెట్టినవాళ్లందరి పేర్లను .. ఆ వివరాలను త్వరలోనే బయటపెడతాను" అని పూరి అన్నారు. 

More Telugu News