Shakeela: ఒంటరిగా మిగిలిపోయాను .. ఏడ్చిన రోజులు ఎన్నో వున్నాయి: నటి షకీలా

  • మా అక్కయ్యవాళ్ల ఫ్యామిలీకి సాయం చేశాను
  •  అందరూ కలిసి నన్ను అనాథను చేశారు 
  • నా గురించి వాళ్లు ఆలోచించకపోవడం బాధాకరమన్న షకీలా

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో నటి షకీలా మాట్లాడుతూ, జీవితంలో తనకి ఎదురైన చేదు అనుభవాలను గురించి ప్రస్తావించారు. "నేను మా అక్కయ్యను కూడా అమ్మలాగే భావించేదానిని. ఆమె నిర్ణయానికి తగినట్టుగానే నడుచుకునే దానిని. ఆమె చిన్న కూతురు డాక్టర్ కావడం కోసం నా పేరుతో వున్న స్థలాన్ని కూడా ఇచ్చేశాను. ఆ అమ్మాయి కూడా నాతో మాట్లాడకపోవడం బాధాకరం.

మా అక్కయ్యకి భర్త .. పిల్లలు వున్నారు. నా నుంచి పొందిన సాయాన్ని వాళ్లంతా మరిచిపోయి మాట్లాడటం మానేశారు. వాళ్లంతా ఒక కట్టు కట్టినట్టుగా నన్ను ఒంటరిని చేసినందుకు ఏడ్చిన రోజులు ఎన్నో వున్నాయి. నేను పెళ్లి చేసుకోలేదు .. పిల్లలు లేరు .. రేపటి రోజున నా భవిష్యత్తు ఏమిటో తెలియదు. కనీసం ఎలా ఉన్నావని మా అక్కయ్య అడగకపోవడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 

More Telugu News