Andhra Pradesh: ఏపీ కానిస్టేబుల్ రాత పరీక్షల ఫలితాలు... ఒక్కో పోస్టుకు 21 మంది పోటీ!

  • ఫలితాలు విడుదల చేసిన కుమార్ విశ్వజిత్
  • అర్హత సాధించిన 58,007 మంది
  • మొత్తం పోస్టులు 2,723

ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు గతంలో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్లడి కాగా, 2,723 పోస్టులకు గాను, 58,007 మంది అర్హత సాధించారు. మొత్తం 64,575 మంది పరీక్షకు హాజరైన సంగతి తెలిసిందే. ఉత్తీర్ణులైన వారిలో 53,509 మంది పురుషులు, 4498 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. పురుషుల్లో ఒక్కో ఉద్యోగానికి 21 మంది పోటీ పడుతుంటే, మహిళల విషయానికి వస్తే, కొన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో ఉన్న పోస్టుల కన్నా తక్కువ మంది అర్హత సాధించారు. అభ్యర్థుల మార్కుల వివరాలను పోలీసు నియామక మండలి వెబ్‌ సైట్‌ లో చూసి తెలుసుకోవచ్చని నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ తెలిపారు. 

More Telugu News