ఏపీ సీఎం జగన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ!
- కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వలేమన్న సర్కారు
- ఏ కోర్టు స్టే ఇచ్చిందో చెప్పాలని ముద్రగడ డిమాండ్
- కాపులు బానిసలుగా బతకాలా? అని నిలదీత
కాపు జాతి ఎలాంటి కోరికలు, ఆశలు లేకుండా బానిసలుగా బతకాలా? అని ప్రశ్నించారు. కేవలం జగన్ ఇస్తామన్న రూ.2,000 కోట్లకు ఆశపడి కాపులు ఆయనకు ఓటేయలేదని స్పష్టం చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా కోర్టు స్టే ఇచ్చి వుంటే 2024 వరకూ కాపుల హక్కులపై మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు.