chattisgargh: ఛత్తీస్ గఢ్ లో నెత్తురోడిన అడవి.. ఇద్దరు మావోయిస్టుల కాల్చివేత!

  • సుక్మా జిల్లాలో బలగాలు-మావోల ఎన్ కౌంటర్
  • భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం
  • కొనసాగుతున్న కూంబింగ్

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా, భద్రతాబలగాల తరఫున ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు సుక్మా జిల్లాలోని కొంటా అటవీప్రాంతంలో సమావేశమైనట్లు నిఘా సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు భారీ ఎత్తున కూంబింగ్ ప్రారంభించాయి.

అయితే కొంటా అడవిలో కొద్దిదూరం వెళ్లగానే బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా, మిగతావారు కాల్పులు జరుపుతూ పరారయ్యారు.  కాగా, ఘటనాస్థలం నుంచి ఇద్దరు మావోల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని సుక్మా ఎస్పీ శలభ్ శర్మ తెలిపారు. మిగిలిన మావోయిస్టుల కోసం కూంబింగ్ ను ముమ్మరం చేశామని చెప్పారు.

More Telugu News