కేసీఆర్ కీలక నిర్ణయం.. పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు!
- స్థలం కేటాయించిన ప్రభుత్వం
- రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు
- సంతాపం తెలిపిన కేసీఆర్
జైపాల్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ప్రజల కల ఫలించడం వెనుక ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో తనకు తెలుసునని అన్నారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా, జైపాల్ అంత్యక్రియలు రేపు జరుగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని, భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం గాంధీభవన్ కు తరలించి, ఆపై నక్లెస్ రోడ్ కు తీసుకెళతామని కుటుంబీకులు వెల్లడించారు.