Madhunandan: రాజమౌళిగారి దర్శకత్వంలోనే ఫస్టు టైమ్ కెమెరా ముందుకు వచ్చాను: కమెడియన్ మధునందన్

  • మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం 
  • 'శాంతినివాసం'లో చిన్న సీన్ చేశాను 
  • నా తొలి సినిమా తేజ గారి 'నువ్వు నేను'      

తెలుగు తెరపై సందడి చేస్తోన్న కమెడియన్స్ లో మధునందన్ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నా పేరు వినగానే తమిళియన్ అనుకుంటారు. కానీ మాది హైదరాబాద్. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం.

అందువలన ఎలాగైనా అవకాశాలు సంపాదించాలనే పట్టుదలతో ఉండేవాడిని. తొలిసారిగా 'శాంతినివాసం' సీరియల్ తో కెమెరా ముందుకు వెళ్లాను. ఆ సీరియల్ కి రాజమౌళి దర్శకుడు కావడం నా జీవితంలో ఒక తీపిజ్ఞాపకం. ఆ తరువాత ఓ వ్యక్తి నన్ను దర్శకుడు తేజగారికి పరిచయం చేశాడు. అలా నా తొలి సినిమాగా 'నువ్వు నేను' చేశాను. అలా నటుడిగా నా ప్రయాణం మొదలైంది" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News