Vikram: ఒక మృగం వంటి పాత్రలో కనిపించబోతున్నాను: హీరో విక్రమ్

  • మణిరత్నం తాజా చిత్రంగా 'పొన్నియన్ సెల్వన్'
  • 'ఆదిత్య కరికాలన్' పాత్రలో విక్రమ్ 
  • బరువు పెరుగుతున్నానన్న విక్రమ్

విక్రమ్ మొదటి నుంచి కూడా ప్రయోగాత్మక పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాకి దర్శకుడు మణిరత్నం. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఆయన 'పొన్నియన్ సెల్వన్' అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఈ సినిమాలో 'ఆదిత్య కరికాలన్' పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఈ పాత్ర చాలా భయంకరమైన మనస్తత్వంతో ఉంటుందనీ, ఒక రకంగా మానవ మృగం వంటి పాత్ర ఇదని అంటున్నారు. అలాగని చెప్పేసి ఇది విలన్ పాత్ర కాదు .. విలన్ పాత్రకి ఎంతమాత్రం తగ్గని పాత్ర. ఈ తరహా పాత్రలో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను .. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ సినిమా కోసం మరింత బరువు పెరిగే పనిలో వున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News