తిరుమలకు పోటెత్తిన భక్తులు... అనూహ్యంగా పెరిగిన రద్దీ!
- వారాంతానికి ముందే రద్దీ
- నిండిపోయిన కంపార్టుమెంట్లు
- బయట కిలోమీటర్ వరకూ క్యూలైన్
కాగా, శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న గురువారం నాడు స్వామిని 72,219 మంది భక్తులు దర్శించుకున్నారని, 30,758 మంది తలనీలాలను సమర్పించారని, హుండీ ఆదాయం రూ. 3.11 కోట్లని తెలియజేశారు. కాగా, ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్నవారికి అన్న పానీయాలను సమకూర్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని, వారికి అల్పాహారం, పాలు, మజ్జిగ, ఉప్మా, సాంబార్ అన్నం తదితరాలను అందించనున్నామని వెల్లడించారు.