South Central Railway: ఆగస్టు 28 వరకూ పలు రైళ్లు రద్దు... వివరాలు!

  • పశ్చిమ కేంద్ర రైల్వే పరిధిలో యార్డు పునరుద్ధరణ
  • అక్టోబర్ 23 వరకూ పనులు జరిగే అవకాశం
  • రైళ్ల రద్దును ప్రకటించిన అధికారులు
నేటి నుంచి ఆగస్టు 28 మధ్యకాలంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పశ్చిమ కేంద్ర రైల్వే పరిధిలో యార్డు పునరుద్ధరణ పనులు జరుగుతున్న దృష్ట్యా రైళ్లను రద్దు చేస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. పట్నా-బనస్ వాడీ హమ్ సఫర్, పట్నా - పూర్ణ, సికింద్రాబాద్ - రాక్సల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆగస్టు 28 వరకూ రద్దు చేశామని, నేటి నుంచి అక్టోబర్ 23 వరకూ కాకినాడ టౌన్ - కోటిపల్లి రైల్ బస్ డెము రైలు సేవలు నిలిపివేశామని వెల్లడించింది. వీటితో పాటు మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేయనున్నామని, వాటి వివరాలను పనులు జరిగే సమయాన్ని బట్టి ప్రకటిస్తామని తెలియజేసింది.
South Central Railway
Trains
Cancel

More Telugu News