karthikeya: 'గుణ 369' విడుదలకి రంగం సిద్ధం

  • కార్తికేయ నుంచి మరో ప్రేమకథా చిత్రం
  • కథానాయికగా 'అనఘ' పరిచయం 
  • వచ్చేనెల 2వ తేదీన భారీ విడుదల   

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ కథానాయకుడిగా 'గుణ 369' రూపొందింది. ఈ సినిమా ద్వారా 'అనఘ' అనే కొత్త కథానాయిక పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

ఆగస్టు 2వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. తిరుమల రెడ్డి - అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, లవ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుంది. 'హిప్పీ' ఫలితం నిరాశపరచడంతో, 'గుణ 369' తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో కార్తికేయ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 

More Telugu News