Kamal: 'భారతీయుడు 2'లో రకుల్

  • వచ్చేనెలలో సెట్స్ పైకి 'భారతీయుడు 2'
  • సిద్ధార్థ్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్
  • కోలీవుడ్లో ఊపందుకోనున్న రకుల్ కెరియర్

శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా 'భారతీయుడు 2' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ మధ్య కమల్ రాజకీయాలతో బిజీగా ఉండటం వలన, షెడ్యూల్స్ ను వెంటనే ప్లాన్ చేయలేకపోయారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా షూటింగును వచ్చేనెలలో మొదలెట్టనున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ ఎంపిక జరగడంతో, కాజల్ స్థానంలోనే అనుకున్నారు. కానీ రకుల్ ను తీసుకున్నది సిద్ధార్థ్ కి జోడీగా నట. ఈ సినిమాలో సిద్ధార్థ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడు. ఆయన జోడీగా రకుల్ ని తీసుకున్నారన్న మాట. తొలిసారిగా ఈ జంట తెరపై కనిపించనుంది. కోలీవుడ్ లో రకుల్ కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అయ్యే అవకాశాలు వున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.

More Telugu News