Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రియారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రోజా, నేను మంచి స్నేహితులం
  • పోటీదారులం మాత్రం కాదు
  • ఏపీ రాజకీయాల గురించి ఇప్పుడే మాట్లాడను

ప్రముఖ సినీ నటి ప్రియారామన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె బీజేపీలో చేరిన అనంతరం, మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవ కోసమే బీజేపీలో చేరానని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి అడిగిన ఓ ప్రశ్నకు ప్రియారామన్ స్పందిస్తూ, రోజా, తాను మంచి స్నేహితులమని, పోటీదారులం మాత్రం కాదని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాలని ప్రశ్నించగా, ఈ అంశంపై ఇప్పుడే తానేమీ మాట్లాడలేనని చెప్పారు.   

More Telugu News