Andhra Pradesh: రాబోయే 6 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటాను!: ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత
  • ప్రత్యేక పూజల నిర్వహణ.. మొక్కుల చెల్లింపు
  • సొంత ఊరిలో ఆలయ నిర్మాణం సాగుతోందన్న రఘువీరా

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ.. తాను రాబోయే 6 రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని రఘువీరా తెలిపారు. తన సొంత ఊరిలో ఆలయ నిర్మాణం జరుగుతోందని ఆయన వెల్లడించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, నిర్మాణ పనుల్లో తాను బిజీగా ఉంటానని పేర్కొన్నారు.

More Telugu News