Varun tej: విడుదల తేదీ మార్చుకున్న 'వాల్మీకి'

  • హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
  • తమిళ 'జిగర్తాండ'కి రీమేక్ 
  • సెప్టెంబర్ 13వ తేదీన విడుదల  

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ - అథర్వ ప్రధాన పాత్రధారులుగా 'వాల్మీకి' రూపొందుతోంది. కొంతకాలం క్రితం తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆగస్టు 15న వస్తుందనుకున్న 'సాహో' సినిమా అదే నెల 30వ తేదీకి వెళ్లింది.

దాంతో 'వాల్మీకి' మరో వారం వెనక్కి వెళ్లవలసి వచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. ఇక నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాను కూడా సెప్టెంబర్ మొదటివారంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా వెనక్కి వెళ్లింది. సెప్టెంబర్ 20 .. 27 తేదీలలో ఏదో ఒకటి ఫిక్స్ చేసే అవకాశాలు వున్నాయి. 

More Telugu News