Telugudesam: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

  • అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
  • సీటులో కూర్చున్న అచ్చెన్నాయుడుని ఎలా సస్పెండ్ చేస్తారంటూ టీడీపీ ప్రశ్న
  • ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విన్నపం

ఏపీ శానసనభ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ను టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. అచ్చెన్నాయుడు తన సీటులో కూర్చున్నా ఎలా సస్పెండ్ చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిప్యూటీ స్పీకర్ ను కోరారు.

More Telugu News