special status: ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రం నడిబొడ్డులో మిమ్మల్ని సన్మానిస్తా: జగన్, మిథున్ లకు కేశినేని ట్వీట్

  • ‘హోదా’ బాధ్యత  జగన్, మిథున్ దేనని ఒప్పుకున్నారు
  • అందుకు వారిని అభినందిస్తున్నా
  • హోదా సాధించలేకపోతే మీరు ఏం చేస్తారో చెప్పగలరా?

రాష్ట్రానికి మేలు చేసే లక్ష్యాలు ఎన్ని ఉన్నా వైసీపీ అంతిమ లక్ష్యం ప్రత్యేక హోదాయే అని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని స్పందించారు. మిథున్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక హోదా సాధించే బాధ్యత వారిదేనని ఒప్పుకున్నందుకు సీఎం జగన్ ని, మిథున్ రెడ్డిని అభినందిస్తున్నానంటూ ఓ ట్వీట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రం నడిబొడ్డులో వాళ్లకు సన్మానం చేస్తానన్న కేశినేని, ఒకవేళ సాధించలేకపోతే వారు ఏం చేస్తారో చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధించి తీరతామని మిథున్ రెడ్డి చేసిన ప్రకటనను కేశినేని పొందుపరిచారు.

More Telugu News