Vijay Sai Reddy: ఒడిశాలో పర్యటిస్తున్న విజయసాయిరెడ్డి

  • పూరి, కోణార్క్ ఆలయాలను దర్శించుకున్న వైసీపీ ఎంపీ
  • తెలుగు ప్రజలు ఆనందంగా ఉండాలని ప్రార్థించాను
  • కోణార్క్ ఆలయ నిర్మాణం అద్భుతమని వెల్లడి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రస్తుతం ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. పూరి, కోణార్క్ ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగింది. నిన్న జగన్నాథుని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు ఆనందంతో, ఐశ్యర్యంతో, ఆరోగ్యంతో ఉండాలని జగన్నాథుని ప్రార్థించినట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆపై కోణార్క్ కు వెళ్లిన ఆయన, సూర్య దేవాలయాన్ని దర్శించారు. కోణార్క్ లోని సూర్య దేవాలయ నిర్మాణం అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. భారత చరిత్రను ఈ దేవాలయం చాటి చెబుతోందని అన్నారు. భారత శిల్ప నిర్మాణం తనను అబ్బుర పరిచిందని అన్నారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News