Rape: ప్రియుడిని నిర్బంధించి, ప్రియారాలిపై అత్యాచారం... ప్రకాశం జిల్లాలో కలకలం!

  • ఏకాంతంగా గడపాలని వెళ్లిన జంట
  • ఆటకాయించి అత్యాచారం
  • కేసును విచారిస్తున్న పోలీసులు

కాసేపు ఏకాంతంగా ఉండాలని వచ్చిన ఓ జంటపై దాడి చేసిన ముగ్గురు యువకులు ప్రియుడిపై దాడి చేసి, అతనితో వచ్చిన యువతిపై అత్యాచారం చేసిన ఘటన ప్రకాశం జిల్లా కారంచేడులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, చీరాల పట్టణం విఠల్‌ నగర్‌ కు చెందిన ఓ యువతి (25)కి మూడేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం భర్త నుంచి విడాకులు పొంది, తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఓ దుకాణంలో పని చేస్తుండగా, ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. వారి సెల్ ఫోన్, దగ్గరున్న డబ్బు దోచుకున్నారు. యువతిని లాక్కెళ్లి, అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

More Telugu News