Sheela Dixit: రేపు నిగమ్ బోధ్ శ్మశానవాటికలో షీలా దీక్షిత్ అంత్యక్రియలు

  • గుండెపోటుతో మరణించిన ఢిల్లీ మాజీ సీఎం
  • రేపు 12 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి షీలా దీక్షిత్ భౌతికకాయం
  • మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు

గుండెపోటు కారణంగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతి చెందడం తెలిసిందే. ఆమెకు రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు షీలా దీక్షిత్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

More Telugu News