బిగ్ బాస్-3 రగడ.. అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ!
- రేపటి నుంచి ప్రారంభం కానున్న రియాలిటీ షో
- బిస్ బాస్-3కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున
- ఇప్పటికే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు
బిగ్ బాస్ నిర్వాహకులు తమను లైంగికంగా వేధించారంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందే వివాదంలో చిక్కుకుంది. ఈ విషయమై తెలంగాణ మానవహక్కుల కమిషన్ కు ఓయూ జేఏసీ ఫిర్యాదు చేసింది. స్త్రీ, పురుషులను ఒకే ఇంట్లో 100 రోజులు బంధించి, కెమెరాలతో చిత్రీకరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికింది. ఈ షోను అడ్డం పెట్టుకుని మహిళలను లైంగికంగా దోచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో జేఏసీ పేర్కొంది. రేపటి నుంచి బిగ్ బాస్-3 షో ప్రసారం కానుంది.