Telangana: తెలంగాణలో బోనాల పండుగ.. ‘స్పెషల్ సాంగ్’ విడుదల చేసిన పవన్ కల్యాణ్!

  • ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న జనసేనాని
  • పార్టీ పటిష్టతపై ముఖ్య నేతలతో చర్చలు
  • క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేయడంపై  చర్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంచెం స్లో అయ్యారు. ఎన్నికల్లో తీవ్ర పరాభవం నేపథ్యంలో అందుకు గల కారణాలపై పార్టీ ముఖ్య నేతలతో ఇటీవల పవన్ సమీక్షలు జరిపారు. జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై చర్చించారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న పవన్ కల్యాణ్ జనసేన నేతలతో ఈ విషయమై సమాలోచనలు జరుపుతున్నారు. కాగా, తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పే బోనాల పండుగ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను మీరూ చూసేయండి.

More Telugu News