Andhra Pradesh: ముఖ్యమంత్రి గారూ.. వెంటనే రోడ్లు మరమ్మతులు చేయించండి సార్!: కేశినేని నాని

  • విజయవాడలో రోడ్లు దారుణంగా తయారయ్యాయి
  • నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ ఎంపీ 

టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. విజయవాడ నగరంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారయిందని కేశినేని తెలిపారు. దీనివల్ల నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

ఈ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. విజయవాడ పాలఫ్యాక్టరీ వద్ద ఉన్న చనమోలు వెంకట్రావు పైవంతెన ఫొటోతో ప్రచురితమైన ఓ పత్రికా కథనాన్ని ఈ ట్వీట్ కు కేశినేని నాని జతచేశారు. తన ట్వీట్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ను కేశినేని ట్యాగ్ చేశారు.

More Telugu News