Bihar: బీహార్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి: మాజీ సీఎం రబ్రీదేవి

  • బీహార్లో కుండపోత వర్షాలు 
  • 33కు చేరిన మృతుల సంఖ్య
  • తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరిన రబ్రీ

కుండపోత వర్షాల ధాటికి బీహార్ విలవిల్లాడుతోంది. దీంతో సంభవించిన వరదల కారణంగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 33కు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో జాతీయ విపత్తు దళాలు మోహరించాయి. బీహార్ వరదలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి స్పందించారు. బీహార్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆమె ప్రధాని మోదీని కోరారు. నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రబ్రీదేవి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని, ప్రజలకు నిత్యావసరాలతో పాటు ఆశ్రయం కల్పించాలని కోరారు.

More Telugu News