Andhra Pradesh: పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగానే 25 జిల్లాలు ఏర్పాటుచేస్తాం!: ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

  • అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చర్చ
  • ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సభ్యుల సూచన
  • ఈ విషయం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తాజాగా ఈ విషయమై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సభ్యులు ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సభ్యులు స్పందిస్తూ.. జిల్లాల ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఇందుకోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన సౌలభ్యం ఉండేలా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు.

  • Loading...

More Telugu News