Karthikeya: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'గుణ 369' ట్రైలర్

  • అర్జున్ జంధ్యాల దర్శకుడిగా 'గుణ 369'
  • కథానాయికగా 'అనఘ' పరిచయం 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

కార్తికేయ కథానాయకుడిగా అర్జున్ జంధ్యాల 'గుణ 369' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి 'అనఘ' పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి, ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. "లవ్ .. యాక్షన్ .. ఎమోషన్  .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరోయిన్ ను ప్రేమిస్తూ .. ఆరాధిస్తూ హీరో ఆమె వెంటపడటం, తాను అనుకున్నది సాధించడం కోసం విలన్ తో గొడవకి సిద్ధపడటం వంటి సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆదిత్య మీనన్ నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను మంజుభార్గవి పోషిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News