Ameerpet: అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద అందరినీ హడలగొట్టిన 'పెయింట్ డబ్బా'!

  • ఆందోళనకు కారణమైన పెయింట్ డబ్బా
  • రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్
  • పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ

గతంలో అనేక పర్యాయాలు ఉగ్రదాడులకు గురైన హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ ఉగ్రసంచారంపై అనుమానాలు తొలగిపోలేదు. తాజాగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఓ పరిణామమే అందుకు నిదర్శనం. అమీర్ పేట స్టేషన్ మెట్రో పిల్లర్ వద్ద ఓ పెయింట్ డబ్బా అందరినీ భయాందోళనలకు గురిచేసింది. ఎవరో వదిలేసి వెళ్లిన ఆ పెయింట్ డబ్బా కొన్ని గంటల పాటు అక్కడే ఉండడంతో పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అది బాంబు అయ్యుండొచ్చని ఆందోళన చెందడంతో డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆ పెయింట్ డబ్బాను క్షుణ్ణంగా పరిశీలించాయి. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News