Sandeep Kishan: 'నిను వీడని నీడను నేనే'పై విమర్శ... ఘాటుగా స్పందించిన సందీప్ కిషన్!

  • విదేశాల్లో కలెక్షన్లు రాలేదు
  • సినిమా పరాజయం పొందిందని వెబ్ సైట్ కథనం
  • ఇండియాలో హిట్ అయిందన్న సందీప్ కిషన్

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, నిర్మాతగా వ్యవహరిస్తూ, నటించిన 'నిను వీడని నీడను నేనే' మంచి టాక్ తో నడుస్తుండగా, సినిమా పరాజయం పొందిందని ఓ వెబ్ సైట్ లో వచ్చిన వార్తపై సందీప్ ఘాటుగా స్పందించాడు. ఈ సినిమా విదేశాల్లో సక్సెస్ కాలేదని, వసూళ్లు బాగాలేవని, విడుదలైన తొలి రోజున ప్రీమియర్స్ తో కలిపి కేవలం 5,939 డాలర్లు మాత్రమే వచ్చాయని, రెండో రోజు 7,513 డాలర్లు, మూడో రోజు 2,588 డాలర్లు వచ్చాయని పేర్కొంది.

 దీనిపై స్పందించిన సందీప్, విదేశాల్లో భారీ వసూళ్లు రాబట్టలేకపోయిన మాట వాస్తవమేనని అన్నాడు. తన సినిమా ఫ్లాప్‌ అని చెప్పుకోవడానికి సంకోచించ బోనని, కానీ, ఈ సినిమా ఇండియాలో బాక్సాఫీసు వద్ద హిట్‌ అని అన్నాడు. కాస్త సమాచారం సేకరించి వార్తలు రాయాలని, సినిమా విదేశీ వసూళ్లను విమర్శించినట్టుగానే, స్వదేశంలో విజయం సాధించిన విషయాన్ని మెచ్చుకోమని కౌంటరేశాడు.

More Telugu News