Aadhar: తప్పుడు ఆధార్ ఇస్తే రూ. 10 వేల ఫైన్!

  • పాన్ కార్డ్ కు బదులు ఆధార్
  • దుర్వినియోగం చేసే వారిపై కొరడా
  • సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి!

పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్ సంఖ్యను వాడుకోవచ్చని చెప్పిన కేంద్రం, ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయాలని చూసేవారిపై కొరడా ఝళిపించనుంది. తప్పుడు ఆధార్ ను నమోదు చేస్తే రూ. 10 వేల జరిమానా విధించేలా సంబంధిత చట్టాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి జరిమానా నిబంధన అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిమతం. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తన బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా పాన్ కార్డ్ తప్పనిసరి కాదని, దాని స్థానంలో ఆధార్ ను కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో 22 కోట్ల పాన్‌ కార్డులు, ఆధార్‌ తో అనుసంధానమై ఉండగా, 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఈ కారణంతోనే పాన్ కు ప్రత్యామ్నాయంగా ఆధార్ ను విస్తృతంగా ప్రమోట్ చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది.

More Telugu News