Hizra: పద్మావతి అమ్మవారి సాక్షిగా హిజ్రాతో వివాహం!

  • నబీ అనే హిజ్రాను ప్రేమించిన మనోజ్
  • నిన్న రాత్రి తిరుచానూరులో వివాహం
  • కేరింతలు కొట్టిన ఇతర హిజ్రాలు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా, నిన్న రాత్రి ఓ హిజ్రాను బెంగళూరుకు చెందిన మనోజ్‌ అనే యువకుడు వేదమంత్రాల సాక్షిగా, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఓ బీమా కంపెనీలో పని చేస్తున్న మనోజ్‌ కు సబీ అనే హిజ్రాతో పరిచయం కాగా, అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు నుంచి దాదాపు పది మంది హిజ్రాలు, వారి స్నేహితులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని, మహద్వారం ముందు పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి స్థానిక అర్చకుడొకరు సాయం చేశారు. ఇతర హిజ్రాల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య సబీ, మనోజ్‌ ల వివాహం జరుగగా, ఆపై రాత్రి పది గంటల సమయంలో ఏకాంత సేవలో పద్మావతి అమ్మవారిని ఈ నూతన జంట దర్శించుకుంది.

More Telugu News