Anand Devarakonda: 'దొరసాని'లో రాజుగానే నన్నంతా చూస్తున్నారు: ఆనంద్ దేవరకొండ

  • నిన్న విడుదలైన 'దొరసాని' 
  • తొలిరోజునే సక్సెస్ టాక్ 
  • సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆనంద్ దేవరకొండ 

ఆనంద్ దేవరకొండ - శివాత్మిక నాయకా నాయికలుగా నిర్మితమైన 'దొరసాని' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజునే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాజాగా ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, 'దొరసాని' సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నేను అనుకున్నట్టుగానే ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కడం సంతోషంగా వుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా 'దొరసాని' పాత్రలో శివాత్మిక, రాజు పాత్రలో నేను బాగా చేశామంటున్నారు. 'రాజు' పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. నన్ను అంతా విజయ్ దేవరకొండ తమ్ముడిగా కాకుండా, 'రాజు'లా చూస్తున్నారు. ఈ సినిమా టీమ్ లోని ప్రతి ఒక్కరూ, సహజత్వం కోసం కష్టపడ్డారు. అదే ఈ రోజున ఈ సినిమాకి విజయాన్ని తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News