Andhra Pradesh: 'నవరత్నాల బడ్జెట్'కు జగన్ కేబినెట్ ఆమోదం

  • మరికాసేపట్లో అసెంబ్లీ ముందుకు బడ్జెట్
  • జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం
  • వ్యవసాయ బడ్జెట్ ను సమర్పించనున్న మోపిదేవి

2019-20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కొద్దిసేపటి క్రితం ఆమోదం పలికింది. మరికాసేపట్లో బడ్జెట్ ప్రతిపాదనలు అసెంబ్లీ ముందుకు రానున్న నేపథ్యంలో, ఈ ఉదయం సచివాలయానికి వచ్చిన జగన్, తన మంత్రివర్గ సహచరులతో సమావేశమై, కొత్త బడ్జెట్ కు ఆమోదం పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నవరత్నాల అమలుపైనే ఈ బడ్జెట్ ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అసెంబ్లీలో సమర్పించనున్నారు. ఆపై వ్యవసాయ బడ్జెట్ ను మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.

More Telugu News