Meghamsh: 'రాజ్ దూత్' తప్పకుండా హిట్ కొడుతుంది: హీరోయిన్ నక్షత్ర

  • హీరోగా మేఘాంశ్ పరిచయం
  • హీరోయిన్ కి ఇదే తొలి సినిమా
  • ఈ నెల 12వ తేదీన విడుదల  

శ్రీహరి తనయుడు మేఘాంశ్ 'రాజ్ దూత్' సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. అర్జున్ - కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘాంశ్ జోడీగా 'నక్షత్ర' నటించింది. తెలుగులో ఈ అమ్మాయికి ఇదే మొదటి సినిమా.

తాజాగా పాత్రికేయుల సమావేశంలో 'నక్షత్ర' మాట్లాడుతూ, "ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా బాగుంటుంది. తొలి సినిమాలోనే నటనకి అవకాశం వున్న పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్ర అందరికీ నచ్చుతుంది. నాకు మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో హీరో 'రాజ్ దూత్' బైక్ కోసం అదే పనిగా తిరగడం .. అందుకు గల కారణం ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చింది.

More Telugu News