Cm: సీఎం జగన్ కు గన్నవరం ఎమ్మెల్యే వంశీ లేఖ

  • పోలవరం కుడికాల్వలోని మోటార్లకు విద్యుత్ సరఫరా చేయాలి
  • 500 మోటార్లు ప్రభుత్వానికి ఇస్తాను
  • రైతుల సౌలభ్యం కోసం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి

పోలవరం కుడికాల్వలోని మోటార్లకు విద్యుత్ సరఫరా చేయాలని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు ఆయన ఓ లేఖ రాశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని రైతులకు దక్కేలా సాయం చేస్తానని, 500 మోటార్లు ప్రభుత్వానికి ఇస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో తాను ఏర్పాటు చేసిన మోటార్లకు ప్రభుత్వం నాలుగేళ్లుగా విద్యుత్ సరఫరా చేసిందని గుర్తుచేశారు. రైతుల సౌలభ్యం కోసం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తన లేఖలో వంశీ కోరారు.

  • Loading...

More Telugu News