India: పాపం కివీస్!... టాస్ గెలిచినా ఆనందంలేదు!... 6 ఓవర్లలో చేసింది 8 పరుగులే!

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • నిప్పులు చెరుగుతున్న భారత బౌలర్లు
  • బుమ్రా, భువీ బౌలింగ్ లో ఆపసోపాలు పడుతున్న కివీస్

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచినా పరిస్థితులు అనుకూలించడంలేదు. ఆరంభంలో ధాటిగా ఆడి భారీగా పరుగులు చేయాలని కివీస్ మేనేజ్ మెంట్ ఆశించినా, టీమిండియా కొత్తబంతి బౌలర్లు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. బుమ్రా, భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులు విసరడంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కనీసం సింగిల్స్ తీయడానికి కూడా సాహసించలేకపోతున్నారు. ఆ జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 8 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే భారత బౌలర్లు ఎంత పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్నారో అర్ధమవుతుంది. కేవలం 1 పరుగు చేసిన డాషింగ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ను బుమ్రా ఓ అద్భుతమైన డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ హెన్రీ నికోల్స్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆడుతున్నారు.

More Telugu News