చంద్రబాబు భద్రత కుదింపు పిటిషన్.. విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు!
- టీడీపీ అధినేతకు భద్రతను కుదించిన ప్రభుత్వం
- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
- తన భద్రతను పునరుద్ధరించాలని న్యాయస్థానానికి వినతి
ప్రస్తుతం ఓ డీఎస్పీతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రత కోసం కేటాయించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గతంలోనే స్పష్టం చేశారు.