Andhra Pradesh: చంద్రబాబు భద్రత కుదింపు పిటిషన్.. విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు!

  • టీడీపీ అధినేతకు భద్రతను కుదించిన ప్రభుత్వం
  • ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • తన భద్రతను పునరుద్ధరించాలని న్యాయస్థానానికి వినతి

తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2004-14 మధ్యకాలంలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఓ ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి సీఎస్ఓలుగా ఉండేవారు. వీరి కింద ముగ్గురు ఆర్ఐలు, ఆర్ఐల పరిధిలో ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు ఉండేవారు.

ప్రస్తుతం ఓ డీఎస్పీతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రత కోసం కేటాయించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గతంలోనే స్పష్టం చేశారు.

More Telugu News